సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల నర్సాపురం నియోజవర్గంలో ఏక్సిడెంట్ అయ్యి భీమవరంలో ప్రవేటు హాస్పటల్ నందు చికిత్స పొందుతున్న హేమ జ్యోతి కుటుంబ సభ్యులకు కెజి ఆర్ టీమ్ సభ్యుల అధ్వర్యంలో కలెక్ట్ చేసిన 41,000 రూ. పైన వచ్చిన డబ్బును జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు చేతుల మీదుగా నేడు, శనివారం మన భీమవరం నియోజకవర్గం లో ప్రవేటు హాస్పిటల్ లో వున్న హేమ జ్యోతి తండ్రి గారికి అందచేసి వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జనసేన నేతలు మెర్లప్రవిణ్,కూన శ్రీనివాస్( గ్యాస్ శ్రీను), మాగాపు భగత్ సింగ్,సభ్యులు సందిప్,హరి పాల్గొన్నారు.
