సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా.. దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.అధికారులు అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచనలు జారీ చేశారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం ఉందని కాబ్బటి ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో వరి ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, వారికి సమాచారం కోసం వ్యవసాయ శాఖ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.
