సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యా సాధనకు దేశాభివృద్ధి కోసం స్థానికంగా తయారయ్యే వస్తువులనే కొనుగోలు చేయాలనే ప్రధాని పిలుపుని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు.నేడు, ఆదివారం భీమవరంలో జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కేఎస్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక స్క్రీన్ పైన ప్రధాని నరేంద్ర మోదీ 126వ మన్-కి-బాత్ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, జిల్లా బిజెపి నాయకులతో కలిసి వీక్షించారు. తదుపరి, ఆత్మ నిర్భర్ ‘భారత్ స్వదేశీ సంకల్ప’ పత్రాన్ని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఇతర బిజెపి నాయకులు చదువుతూ ప్రతిజ్ఞ చేశారు. ప్రతి భారతీయుడు ఈ సంకల్పాన్ని స్వీకరించి, స్వదేశీ ఉత్పత్తులను స్వదేశీ హ్యాండీ క్రాఫ్ట్స్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ ప్రజలందరూ ‘వొకల్ ఫర్ లోకల్’ ధోరణితో ముందుకెళ్లాలని, చిన్న చిన్న మార్పులు పెద్దదిగా మారతాయని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరూ పాటించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, లతో పాటు పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
