సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం తెల్లవారుమమున ఏలూరు జిల్లా భీమడోలు వద్ద కొందరు బొలెరోకారుతో రైలు ట్రాక్ దాటుతూ చేసిన దూకుడు ప్రయత్నం వికటించి వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది, . నేటి తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఉదయం 5 గంటలకు పైగా రైళ్లు నిలిపివేశారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌ వస్తుండటంతో భీమడోలు జంక్షన్‌ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అదే సమయంలో బొలెరోలో వచ్చిన కొంతమంది వ్యక్తులు సినిమా ఘటనల తరహాలో వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టి వాహనం తో రైల్వే ట్రాక్‌పైకి వచ్చారు అని భావిస్తున్నారు. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ సమీపించడంతో సదరు వ్యక్తులు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది. రైలు ఇంజిన్‌ కూడా దెబ్బతినడంతో మరో ఇంజిన్‌ అమర్చేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు విచారణ చేపట్టారు. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు అసాంఘిక శక్తులా ? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు జరుగుతుంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *