సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో తుందురు పేరు చెబితే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రోజులు అక్కడ ఆక్వా ప్యాక్టరీ నిర్మాణం దాని ద్వారా వచ్చే కాలుష్యం నివారణకు ఆ గ్రామా ప్రజలు గత చంద్రబాబు పాలన హయాంలో అరెస్టులకు భయపడకుండా వందలాది రోజులు పోలిసుల నిర్బంధంలో అక్కడ ప్రజలు చేసిన పోరాటం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరల సిపిఎం పార్టీ దానిపై పెద్దస్థాయిలో పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు మధు , జిల్లా సిపిఎం సీనియర్ నేత బలరాం తో కలసి నర్సాపురంలో మీరా స్మా రక గ్రంథాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాజగా ప్రకటించారు. తుందుర్రు మెగా ఆక్వా పార్కు ను తొలగించాలని స్థానికులతో కలిసి డిసెంబరు 4 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో తన నేతృత్వంలో మరోసారి ఉద్య మాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. కుటుంబాలు నివాసాల ఉంటున్న ప్రాంతంలో ఏర్పా టు చేసిన మెగా ఆక్వా పార్కు తో ఆ ప్రాంతం మొత్తం కాలుష్య మయం అయ్యిందన్నా రు. గతంలో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్ తుందుర్రు వచ్చిన సమయం లో తాను అధికారంలోకి వస్తే ఆక్వా ఫుడ్ పార్కు ను బంగాళాఖాతంలో కలిపివేస్తానన్నారని, ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని ఆరోపించారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు నరసాపురం తీరంలో ఆక్వా యూనివర్సి టీ నిర్మిస్తున్నారని, మరి తుందురు మెగా ఆక్వా పార్కు తొలగించే హామీని కూడా నెరవేర్చి దానినే ఆక్వా వర్సి టీగా మార్చాలని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *