సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు జన్మ దినవేడుకలు నేపథ్యంలో గత సాయంత్రం నుండి భీమవరం గునుపూడిలోని ఆయన కార్యాలయం వద్ద రాజకీయాలకు అతీతంగా పట్టాన ప్రముఖులు, ఉద్యోగ సంఘాల నేతలు , వైసీపీ నేతలు ఆయనను కలసి పుష్ప గుచ్చాలు కేక్ లు కట్ చేయించి, ఇచ్చి అడ్వాన్స్ , హ్యాపీ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. నేడు శుక్రవారం తాడేపల్లిలో ఆయన అధికార కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యేలు కల్సి శుభాకాంక్షలు తెలిపారు. నేడు, శుక్రవారం భీమవరంలో ఆయన పెద్ద కుమారుడు సుందర్ రాజు కు పలువురు శుభాభినందనలు తెలపడం జరిగింది.
