సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి ఉష శ్రీ చరణ్ దర్శించుకున్నారు వీరికి ఆలయ ప్రధానర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ , ముత్యాల వెంకట రామారావు , మావూరి సుందరరావు పాల్గొన్నారు. అని దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు. తదుపరి ఇక గునుపూడి, భీమవరం నందు వేంచేసియున్నశ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నకు మంత్రి కె.వి.ఉష శ్రీ చరణ్ చేరుకొని ఆలయ మర్యాదలతో స్వామివారిని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కోడే విజయలక్ష్మి మరియు ధర్మకర్తలు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి, చాగంటి సురేష్ నాయుడు తెలిపారు
