సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, 1 కోటి 31 లక్షల 70 వేల రూపాయల ప్రభుత్వ నిదులల్తో సీసీ రోడ్ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని 29వ వార్డు సంజీవయ్య నగర్ లో రూ 25 లక్షల 20 వేలతో నెంబర్ 25-9-180 నుండి వరకు 25-9-181/18 వలుకు నిర్మాణం చేసిన నూతన సీసీ రోడ్ ను ప్రారంభించారు. తదుపరి 75 లక్షలతో ఎలక్ట్రికల్ ఫోల్ నెంబర్ SS 105 / ABC నుండి 25-9-183/4 వరకు నిర్మించే సిసి రోడ్ పనులకు, అదే మాదిరిగా 31.5 లక్షలతో డోర్ నెంబర్ 25-9-181 నుండి డోర్ నెంబర్ 25-9-181.19 వరకు నిర్మించే సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ అందిస్తున్న సహకారంతో పట్టణంలోని ప్రతి వార్డు .. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాము..అభివృద్ధి .. సంక్షేమం రెండు కళ్ళుగా పని చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం అన్నారు.
