సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇటీవల మరణించిన ఉండి మాజీ శాసన సభ్యులు మరియు మాజీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, కీ శే ,పాతపాటి సర్రాజు కుటుంబాన్ని పరామర్శించడానికి నేడు, శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైవి సుబ్బారెడి భీమవరం లోని సర్రాజు గారి గృహానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు YV సుబ్బారెడ్డి కి పుష్పగుచ్చెమ్ ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కీశే శ్రీ పాతపాటి సర్రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భముగా వైవి సుబ్బారెడ్డి ని స్థానిక వైసిపి నేతలు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.
