సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్పపీడనం కారణంగా భీమవరంలో ఏకబిగిగా వర్షపు జల్లులు పడుతున్న నేపథ్యంలో.. వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు అధిక వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో రేపు 18వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కావున జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరగాల్సిన పి జి ఆర్ యస్ రద్దు సమాచారాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కలెక్టర్ కోరడం జరిగింది.
