సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన్ స్వామి దేవాలయం నేడు, సోమవారం, పుష్యమాసం బహుళ పక్షం నేపథ్యంలో వేలాది భక్తులతో ఆధ్యాత్మిక శోభతో అలరించింది. అయితే ఈ ధనుర్మాసం నేపథ్యంలో స్వయం భువుడు శ్రీ సోమేశ్వరునికి ఉదయం 7గంటల లోపు అభిషేకాలు పూర్తీ చేసి ప్రతి రోజు సర్వ సుందరుడుగా పుషాలతో ఆభరణాలతో అలంకారం చేస్తుండటంతో అభిషేకాలుకు వచ్చే భక్తులు కొంత నిరాశ చెందిన దేవాలయ ఆవరణలో శివలింగాలుకు కొబ్బరి కాయనీరు, ఆవు పాల అభిషేకాలు స్వయంగానే చేసుకొంటున్నారు. ఇక క్షేత్ర పాలకుడు శ్రీజనార్ధన స్వామి కూడా సుందర పుష్ప అలంకరణలో ఈ ధనుర్మాసంలో భక్తులను ఆసిర్వదిస్తున్నారు.
