సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పట్టణ పరిధిలోని ఆస్తి పన్నులు చెల్లింపు యజమాములకు మునిసిపల్ కమిషనర్ శ్యామల ఒక ప్రకటనలో తెలియచేయునది ఏమనగా… 2023- 2024 మొదటి అర్ధ సంవత్సరం ది.30-09-2023 వ తేదీతో గడువు ముగియనున్నందున పట్టణ ప్రజల సౌకర్యార్థం భీమవరం పురపాలక సంఘ కార్యాలయము నందు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చెయ్యటమైనది. కావున ఇంకను పన్నులు చెల్లింపు చెయ్యని ఇళ్ళ యజమానులుప్రత్యేక కౌంటర్ ను ఉపయోగించుకుని సంబందించిన ఇంటి పన్నులు, నీటి చార్జీలు మరియు ఖాళీ స్థలం పన్నులు చెల్లించి భీమవరం పురపాలక సంఘ పట్టణా అభివృద్ధికి తోడ్పడ వలసినదిగా కోరారు.
