సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పరిధిలో గల పబ్లిక్ ప్రదేశములలో అనగా ఎలెక్ట్రికల్ పోల్స్, టెలిఫోన్ పోల్స్, డివైడెర్లు, ప్రభుత్వ ప్రహరీ గోడలు మరియు రైల్ ఓవర్ బ్రిడ్జ్ ప్రదేశములలో ఎటువంటి పోస్టర్స్, బేనర్లు మరియు సైన్ బోర్డ్స్, మొదలైనవి అతికించుట/ఏర్పాటు చేయుట నిషేదించడమైనది. అట్లు గాక, పబ్లిక్ ప్రదేశముల యందు పోస్టర్స్, బేనర్లు మరియు సైస్ బోర్డ్స్, మొదలైనవి అతికించినచో Defacement of Public Places Act అనుసరించి అపరాధ రుసుము రూ.2.00 లక్షలు వరకు వసూలు చేయుటయే కాక మరియు సంబందిత వారిపై కేసులు నమోదు చేయుటకు పోలీసు డిపార్ట్మెంట్ వారికి సిఫార్సు చేయబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది. మరియు పురపాలక సంఘ పట్టణ పరిధిలో ఎటువంటి ఫ్లెక్ష్లు, బేనర్లు ప్రదర్శించినట్లయిత్నే పురపాలక సంఘ అనుమతి పొందవలసినదిగా కోరడమైనది. లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకొంటామని భీమవరం మునిసిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు
