సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ములుగుర్తి వెంకటరామయ్య నేడు, శుక్రవారం ఉదయం మరణించారు. ఈయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 3సారులు స్థానిక 36వ వార్డు నుండి ఆయన టీడీపీ బీజేపీ పార్టీల తరపున గెలుపొందడం ఒకసారి ఆ వార్డు మహిళా రిజర్వ్ కావడంతో ఆయన భార్య కౌన్సిలర్ గా గెలుపొందడం స్థానికంగా ఆయన పట్ల ప్రజలలో ఉన్న మంచి పట్టుకు నిదర్సనం. బీజేపీ పార్టీ గతంలో బీజేపీ కౌన్సిలర్ గా ఉన్నపుడు భీమవరం మున్సిపల్ కౌన్సెలర్స్ లలో వైస్ చైర్మెన్ ఎన్నిక జరిగినప్పుడు బీజేపీ కి టీడీపీ మద్దతు ఉన్నపటికీ కాంగ్రెస్ కు ఓట్లు సమానంగా ఉన్నపుడు అప్పటి బీజేపీ నరసాపురం ఎంపీ , మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు భీమవరంలోమున్సిపల్ కౌన్సిల్ కు వచ్చి తన ఎక్స్ అఫిషియో ఓటువేసి మూలుగుర్తి వెంకటరామయ్యను వైస్ చైర్మెన్ పదవిలో కూర్చోబెట్టడం అప్పటిలో పెద్ద సంచలనం.. స్థానిక ప్రజా సమస్యల కోసం రాజకీయాలకు దూరంగా కౌన్సిల్లో పోరాడేవారు. వైస్ చైర్మెన్ గా చేస్తూ కూడా అపట్లో తన కిరాణాకొట్టు లో ప్రజలకు తానే సరుకు పొట్లాలు కట్టి ఇచ్చిన నిగర్వి.. కొంత కాలం తనవార్డు ప్రజల కోసం తక్కువ ధరలకు కేబుల్ టివి నిర్వహించి నష్టపోయారు. ఈయన మృతి పట్ల అనేక మంది మిత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.మా మిత్రులు వెంకటరామయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. సిగ్మా ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *