సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో మినీ షిరిడి గా ప్రసిద్ధి పొందిన స్థానిక 24వ వార్డులోని శ్రీఅభయసాయి ధ్యాన మందిరం 31వ వార్షిక మహోత్సవాలలో భాగంగా నేడు, శుక్రవారం వేద పండితులతో రుద్రాభిషేకలు, తులసిదళం, చామంతి పుష్పాలతో విశేషార్చన నిర్వహించారు. ఈ వేడుకలు ఈనెల 8వ తేదీ గురువారం ప్రారంభించినట్లు ఈనెల 11 వరకు వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తామని, 11 తేదీ న బాబావారికి 22 ద్రవ్యాలతో అభిషేకం, అన్నాభిషేకం, నిర్వహించి తదుపరి భక్తులకు అన్నదానం చేస్తామని, భక్తులందరూ పాల్గొనాలని మేనేజింగ్ ట్రస్టీ నిమ్మల శారదా సాయి, కార్యదర్శి అడబాల సాయిరామ కుమార్, కోశాధికారి శివకుమార్ తెలిపారు. విశేషంగా భక్తులు శ్రీ షిరిడి బాబావారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *