సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చాల కాలంగా ప్రశాంతంగా ఉన్న భీమవరం పట్టణంలో …రెస్ట్ హౌస్ రోడ్ చివరలో (చేపల మార్కెట్ దాటాక ) రామాలయం ఎదురుగా వీధిలో సంతోష్ కుమార్ అనే యువకుడ్ని గత రాత్రి 10 గంటలు దాటాక కొందరు యువకులు దాడి చేసి అతని ఇంటి వద్దే హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. ..సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, యువకుడి దేహాన్ని స్వాధీనం చేసుకొని నేడు, గురువారం ఉదయం దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు సంతోష్ పై పాత కక్షలు నేపథ్యంలో విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.. పోలిసుల విచారణలో పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది.
