సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం లో నేడు, బుధవారం హుండీ తెరచి లెక్కించగా గత గత 36 రోజులకు వచ్చిన ఆదాయం హుండీల ద్వారా 21,68,846.రూ అక్షరాల ఇరవై ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు మరియు అన్నదానం హుండీ ద్వారా 37,821 రూ అక్షరాల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి రూపాయలు, మరియు భక్తులు హుండీలో సమర్పించిన బంగారం 42 గ్రాముల 800 మిల్లీల గ్రాములు, వెండి 75 గ్రాములు 500 మిల్లీ గ్రాములు మరియు కొంత విదేశీ కరెన్సి లభించింది. ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, తనిఖీదారివారు వి వెంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కరూరి వైశ్య బ్యాంకు సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *