సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో వాడవాడలా శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నా నేపథ్యంలో .. ఏపీ శాసనమండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు భీమవరంలో దాదాపు అన్ని రామాలయాల వద్ద శ్రీ రాములోరి కల్యాణోత్సవాలలో పాల్గొనడం విశేషం. నేటి, శనివారం ఉదయం గునుపూడి స్థూపం సెంటర్, శ్రీ సోమేశ్వరాలయం వద్ద రామాలయం, నాచువారి సెంటర్ లో గల రాధాకృష్ణ మందిరం, రైతు బజార్ వద్ద, రామాయణం సుబ్బన్న గారి తోటలో గల శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయం ,శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మ వారి ఆలయం వద్ద జరిగిన ఇంకా పలుచోట్ల శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
