సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరం బ్లోసమ్స్ ఇన్నర్వీల్ క్లబ్ వారు ప్రెసిడెంట్ శ్రీకరీ సెక్రటరీ బి ప్రత్యూష తో 25 మంది మహిళలు శ్రీ అమ్మవారికి చీర రవిక లు, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, మిఠాయిలు తో ఆషాడమాశ సారి సమర్పించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు అందజేశారు.
