సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ కు నూతన ఎస్ఐ గా హనుమంతరావు పదవి బాధ్యతలు నేడు, సోమవారం స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు, స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆయనకు అభినందనలు తెలిపి .. ఆయనతో .. విధి నిర్వహణలో భీమవరం ప్రజలకు విశిష్ట సేవలు అందించి, పిర్యాదులు ఇవ్వడానికి వచ్చినవారితో ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరించాలని, శాంతి భద్రతల విషయంలో రాజీపడకుండా పని చెయ్యాలని అప్పుడే ప్రజల్లోనూ, ప్రభుత్వం లోనూ మంచి పేరు ఉంటుందని అన్నారు
