సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా మీదుగా వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్న వేళా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న,భారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, రాయల సీమలో పరిస్థితులపై సీఎం చంద్రబాబు నేడు, గురువారం ఉదయం కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లాల అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ఇరిగేషన్ అధికారులు వివరించారు. ఈ రోజు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, అధికారులకు సూచించారు.కాగా నెల్లూరు జిల్లా, లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *