సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంకా పెరిగిపోయిన నేపథ్యంలో భారత్లో నేడు సోమవారం స్టాక్ మార్కెట్ తో పాటు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పసిడి ధర సగటున సుమారు రూ.6 వేల మేర, వెండి రూ.15 వేల మేర పడిపోయింది. నేడు (మార్చ్ 23) ఉదయం 10.00 గంటల సమయంలో విజయవాడ ,హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ.1,40,020కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.5,950ల మేర పతనమైంది. ఇక 22 క్యారెక్ట 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.5,450ల మేర తగ్గి రూ.1,28,350కు చేరుకుంది. వెండి ధరలో కూడా ఏకంగా రూ.20 వేల మేర కోత పడింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2 లక్షల 30వేలకు చేరుకుంది.
