సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మరోసారి సునామి ప్రమాదం పొంచివుంది. సునామీ అలెర్ట్తో ఇండోనేషియా తీర ప్రాంత ప్రజలు కంపించిపోతున్నారు. నేడు, మంగళవారం ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తాజా భారీ భూకంప తీవ్రత తో ఇండోనేషియా ప్రజలు తో పాటు భారత్ సముద్ర తీరా ప్రాంతం ఫై కూడా పరిశోధకులు నిఘాలో అప్రమత్తమయ్యారు. గతంలో 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్రతీరంలో వచ్చిన భూకంపం.. సునామీగా మారటంతో దేశం అల్లకలోక్లమైన విషయం తెలిసిందే.అపట్లో వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్లాండ్ మరో తొమ్మిది దేశాల్లో బీభత్సం సృష్టించింది.
