సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల పంచారామ క్షేత్రం లో నేడు, శుక్రవారం వైశాఖ పౌర్ణమి సందర్భములో శ్రీ సోమేశ్వరుని మామిడి పండ్లతో విశేషము గా అలంకరించారు. బంగారు మేలిమి వర్ణం మామిడిపళ్ళ మధ్య దివ్య అలంకరణలో శ్రీ స్వామివారిని భక్తులు విశేషంగా దర్శించుకొన్నారు. . సదరు ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, కోడే విజయలక్ష్మి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి చాంగటి సురేష్ నాయుడు పర్యవేక్షించారు.
