సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో అల్లు అర్జున్‌ ఫై వరుసగా జరుగుతున్నా పరిణామాలు ఫై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటుతుంటే హైదరాబాద్ లో అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంధ్యా ధియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని అన్నారు.అయితే సమస్య ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్లో కథ అల్లి రేవంత్ రెడ్డి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తుంటే ఏనాడైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. మీకో న్యాయం….అల్లు అర్జున్‌,ఇతరులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *