సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రధాని మోడీ ప్రచారంలో సీఎం జగన్ పేరు ఉచ్చారణ చేయనప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఫై చేసిన విమర్శల నేపథ్యంలో అదే తరహాలో ఢిల్లీ సర్కార్ ఫై న చంద్రబాబు కూటమి పైన.. నేడు, మంగళవారం సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్ఛాపురం లో భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. జరుగుతున్నా ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ ఘన విజయాన్ని ఎవ్వరు ఆపలేరని, టీడీపీ జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు పచ్చమీడియా కలసి వచ్చిన కూడా ప్రజాబలం ఉన్న తనను ఏమి చెయ్యలేరని సవాల్ విసిరారు. చరిత్రలో లేని విధంగా ఒక్కడి మీదకు ఇంత మంది పార్టీలను ఏపీలో జగన్ ఎలా ఎదుర్కొంటాడు? అని దేశం యావత్తు ఎదురు చూస్తుందని..ఎంతమంది వచ్చిన ఏం పరవాలేదు.. మీరే నా బలం.. మీరు వేసే ఓటు దెబ్బతో ఢిల్లీ పీఠం కదలాలి. జూన్ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని తన ధీమా వ్యక్తం చేసారు..సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతోళ్ల కలిశాడని దుయ్య బట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు వృద్దులకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశామన్నారు. విశాఖను ఎగ్జిక్యూ గ్జి టివ్ క్యాపిటల్గా చేస్తామని పేర్కొ న్నారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు.. సాలూరులో గిరిజన విశ్వవిద్యా లయం ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర లో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్ఫోన్ కనెక్టవిక్టటీ పెంచామని ప్రకటించారు. ఫై తాజా ఫొటోలో ఇచ్ఛాపురం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *