సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. బీజేపీ, టీఆరెస్ అభ్యర్థుల మధ్య స్వల్ప ఓట్ల తేడాతో ఆదిక్యతలు రౌండ్ రౌండ్ కి మారుతుంది. కాంగ్రెస్ పార్టీ అబ్యర్ధి కూడా వేలాదిగా గౌరవ పూర్వక ఓట్లు సాదిస్తుండటం విశేషం. అయితే నేటి, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తాజా సమాచారం ప్రకారం.. 5వ రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ 6,162, బీజేపి 5,245 ఓట్లు రాగా, ఐదవ రౌండ్ లో టీఆర్ఎస్ 917 ఓట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 1,430 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది.
