సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో అధికార టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అత్యంత ప్రతిష్టాకరంగా మారిన మునుగోడు ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు, సోమవారం తాజగా షెడ్యూలు ప్రకటించింది. నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహిస్తునారు. 6వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈ ఎన్నికకు సంబందించిన నోటిఫికేషన్ ఈ నెల 7వ తేదీన వెలువడుతుంది. ఒకవేళ ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే వచ్చే మరో ఏడాది లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధికారానికి ఎంత దగ్గరగా ఉందొ తన శ్రేణులకు మంచి ఊపు వచ్చే విధంగా ఉంటుంది. అధికార టీఆరెస్ పార్టీ పెద్దలలో, క్యాడర్ అంతరాలలో అలజడి ఖాయంగా ఉంటుంది. ఇక కాంగ్రెస్ గతంలో తన సీటు తానే గెలిస్తే తెలంగాణాలో పార్టీ అసలు సజీవంగా ఉంటాయి.. లేకపోతె అక్కడ గెలిచిన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుంది.
