సిగ్మాతెలుగు డాట్, న్యూస్: రిమాండ్ లో ఉంచాలన్న ACB కోర్ట్ ఆదేశాల నేపథ్యంలో.. గత రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ను విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలు కు వర్షం కురుస్తుండగానే భారీ పోలీస్ సెక్యూరిటీ వాహనాలతో తరలించారు. తోడుగా వెళ్లిన తనయుడు లోకేష్ తండ్రి చంద్రబాబు పోలీస్ స్టేషన్ లోపలి వరకు వెళ్ళాక వెనక్కి వచ్చారు. చంద్రబాబుకు రిమాండ్‌ ఖైదీ నెంబరు 7691 కేటాయించారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నందున ప్రత్యేక గది..సెంట్రల్‌ జైలులోని ‘స్నేహ’ బ్లాక్‌ను చంద్రబాబు కోసం కేటాయించారు. బ్లాక్‌ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యూటీ సిబ్బంది మినహా ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు. నేటి సోమవారం ఉదయం, చంద్రబాబుకు అల్పాహారంగా ఆయన సిబ్బంది ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లింది. చంద్రబాబు కు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో ఫ్రూట్ సలాడ్‌ను కుటుంబ సభ్యులు అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ పంపించారు. చంద్రబాబు పెద్ద వయస్సు ఆరోగ్యరీత్యా ఆయనకు ఇంటి వద్ద నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రత్యేక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ప్రత్యేక భద్రత కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *