సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. 24 క్యారెక్ట 10 గ్రాములు ధర రూ. లక్షా 10 వేలు దాటింది. ఇవాళ మంగళవారం ఒక్క రోజే రూ. 1360 పెరిగింది. అలాగే వెండి ధరలు కూడా నేడు ఒక్కరోజే కిలోరూ. 3000 పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, హైదరాబాద్ లో ఈరోజు 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,10,290 మరి కీలకమైన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1250 పెరిగింది. దీంతో రూ.1,01,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 1360 పెరిగింది. దీంతో రూ. 1,10,290 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కె ట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,40,000 వద్ద అమ్ముడవుతోంది.అయితే ఢిల్లీలో కిలో సిల్వ ర్ ధర రూ. 1,30,000 వద్ద ఉండటం గమనార్హం.
