సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 43,92,666/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను 57 మంది లబ్ధిదారులకు నేటి శనివారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు భీమవరం పట్టణ శివారు లోని పెదమిరం లోని తన కార్యాలయంలో అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్త పల్లి నాగరాజు పాల్గొన్నారు.
