సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న కు చెబుదాం అనే కొత్త పరిష్కార కార్యక్రమానికి రేపు మంగళవారం శ్రీకారం చుట్టబోతోం ది..ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులను వినడం , వాటిని వెంటనే పరిష్కరించడం ఈ కార్య క్రమం ఉద్దేశంగా పెట్టుకున్నారు.. జగనన్న కు చెబుదాం.. కోసం 1902తో టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నారు.. ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్ చేయనున్నా రు.దీనిలో ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడం లో మీకు ఏమైనా ఇబ్బందులున్నా .. వైఎస్సా ర్ పెన్షన్ కానుక అం దుకోవడం లో ఏమైనా సమస్య లు ఉన్నా , రేషన్ కార్డు వంటివి పొందడం లో ఏమైనా అవాంతరాలు ఎదురైనా.. రైతన్న లకైనా, అక్క చెల్లెమ్మ లకైనా, అవ్వా తాతలకైనా, మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడం లో ఏమైనా అవాం తరాలు ఎదురైనా.. వైఎస్సా ర్ ఆరోగ్య శ్రీ సేవలు లో ఏమైనా సమస్య లున్నా జగనన్న కు చెబుదాం టోల్ ప్రీ నంబర్ 1902ను సంప్రదించవచ్చు .మీ సమస్య ను చెప్పేం దుకు 1902 టోల్ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి. కాల్ సెం టర్ ప్రతినిధితో మీ సమస్య ను చెప్పం డి. మీ ఫిర్యా దును నమోదు చేసుకుని YSR (యువర్ సర్వీ స్ రిక్వె స్ట్) ఐడీని కేటాయిస్తారు. ఎప్పటికప్పు డు మీ అర్జీ స్టేటస్ గురించి ఎస్ఎం ఎస్ ద్వారా మీకు అప్డేట్ అందుతుంది సమస్య పరిష్కారం తర్వా త ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి
