సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎన్నికల వేడి రాజుకొంది. ఎల్లుండి అంటే ఈనెల 25 లోగ నామినేషన్స్ పక్రియ కూడా పూర్తీ కావస్తుంది. అభ్యర్థులు అందరు దాదాపుగా నామినేషన్స్ వెయ్యడం కూడా పూర్తీ కావస్తుంది. ఈ నేపథ్యంలో భీమవరం లో జనసేన పార్టీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు రేపు బుధవారం ఉదయం నామినేషన్స్ వెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల నేతలతో కలసి, క్యాడర్ తో సహా ఊరేగింపుగా వెళ్లి ఆర్ డి ఓ కార్యాలయంలో నామినేషన్ వెయ్యనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని కూటమి శ్రేణులకు అంజిబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. పులపర్తి అంజిబాబు నేటి మంగళవారం సాయంత్రం వీరవాసరం మండలంలో కమతాలపల్లి, మత్స్యపురి పాలెం,బాలేపల్లి, నందమూరిగరువు, పెరికిపాలెంగ్రామాలలో విస్తృతంగా తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామా పెద్దలను, ప్రజలను ఓట్లు అభ్యర్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *