సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు, మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet ) జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *