సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం 10 వ తరగతిలేదా ఐటీఐ చదివితే చాలు.. ఆ నిరుద్యోగులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో దాదాపు 32,438 గ్రూప్-డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఈ పోస్టులకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిలో పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి. . ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు తుది గడువు ఫిబ్రవరి 22వ తేదీతో ముగుస్తుంది. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పుర్, కోల్కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్.. ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్ధులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
