సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలోని రైల్వే స్టేషన్ సమీపంలోని డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిధిగా రైల్వే అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 17 ఎడిషన్ల రోజ్గార్ మేళా ద్వారా దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని చెప్పారు. 2047 నాటికి విక్షిత్ భారత్ను సాధించాలనే దార్శనికతకు అనుగుణంగా, ప్రభుత్వం “మేక్ ఇన్ ఇండియా” వంటి కార్యక్రమాల ద్వారా భారీ ప్రైవేట్ రంగ ఉపాధిని ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. విషయంలోకి వెళ్ళితే.. రోజ్గార్ మేళా యొక్క 17వ విడతలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు, శుక్రవారం దేశంలోని 40 ప్రదేశాలలో కొత్తగా నియమితులైన అధికారులను వర్చువల్ మోడ్ ద్వారా ప్రసంగించారు. ఈ జాతీయ కార్యక్రమంలో, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు మరియు మంత్రిత్వ శాఖల నుండి దాదాపు 51,000 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని రోజ్గార్ మేళాను విజయవాడ మరియు విశాఖపట్నం అనే రెండు ప్రదేశాలలో నిర్వహించారు. విజయవాడలో ఏడు వేర్వేరు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి 69 మంది అభ్యర్థులుకేంద్ర మంత్రి,శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా తమ నియామక ఉత్తర్వులను అందుకున్నారు.
