సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ఆర్మీలో కొత్తగా 76 ఉద్యోగాలు పడ్డాయి. అభ్యర్థులకు డిగ్రీ చదివి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 2025 ద్వారా మహిళలు, పురుషులు లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఉద్యోగంలో చేరవచ్చు.అర్హతలివే :కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేయాలి. ఎన్సీసీ ‘C’ సర్టిఫికేట్లో బి-గ్రేడ్ వయస్సు : 19 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య (జూలై 2, 2000 నుంచి జూలై 1, 2006)లో జన్మించాలి. అర్హుల ఎంపికకు అకడమిక్ మార్కులతో దరఖాస్తుల పరిశీలన చేసి షార్ట్లిస్టింగ్ చేస్తారు. బెంగళూరులో రెండు దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి మెడికల్ టెస్టులు చేస్తారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 49 వారాల ట్రైనింగ్ సమయంలో నెలకు స్టైపెండ్ రూ. 56,100 పొందవచ్చు.ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో జాబ్లో జాయిన్ చేస్తారు. వార్షిక రూ. 17లక్షల నుంచి రూ. 18 లక్షల సీటీసీ మిలటరీ పే, డీఏ, హెచ్ఆర్ఏ,
దరఖాస్తుకు లాస్ట్ డేట్ : మార్చి 15, 2025, అధికారిక వెబ్సైట్(indianarmy.nic.in) ద్వారా అప్లయ్ చేయొచ్చు.
