సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వేసవిలో ప్రయాణికుల రద్దీని దృ ష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నడుపుతున్న ప్రత్యక రైళ్లతో పాటుగా తాజగా మరిన్ని ప్రత్యే క రైళ్లు వచ్చే మే నెలలో గోదావరి జిల్లాల మీదుగా నడిపేం దుకు సిద్ధమైంది. మే నెల 9వ తేదీన 07025 కాచిగూడ- కాకినాడ, మరియు 10 వ తేదీన 07028 కాకినాడ నుండి కాచిగూడ కు నడుపుతారు. మే13వ తేదీన 07487 నాందేడ్ నుండి కాకినాడ… మరల మే 14న 07488 కాకినాడ నుండి నాందేడ్ కు నడుపుతారు. మే 11వ తేదీ శనివారం రాత్రి 11 గంటలకు 07175 హైదరాబాద్ నుండి నరసాపురం మధ్య నడుపుతారు. మే 13వ తేదీ నాయంత్రం 6 గంటలకు 07176 నరసాపురం నుండి హైదరాబాద్ కు ప్రత్యేక రైల్ బయలు దేరుతుంది. మే 10వ తేదీ రాత్రి 9 గంటలకు 07271సికింద్రాబాద్ నుండి కాకినాడ కు మరియు 07272 కాకినాడ నుండి సికింద్రాబాద్ 11వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. నెంబర్, 07440 తిరుపతి- శ్రీకాకుళం ప్రత్యక రైళ్లు మే 5వ తేదీ (మరియు 12వ తేదీన కూడా నడుపుతారు.) మరల తిరుగు ప్రయాణంలో నెంబర్07441, మే 6 మరియు 13 తేదీలలో నడుపుతారు. పూర్తీ వివరాలకు రైల్వే .. సంబంధిత ఆన్ లైన్ లో చూసుకోండి.
