సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వ్యాపారస్తుల ప్రతిష్టాకమైన భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సౌజన్యముతో విజయవాడ లోతట్టు ప్రాంతాల వరద బాధితులకు ఛాంబర్ నుండి విజిటబుల్ బిర్యాని తయారు చేయించి ప్యాకెట్లుగాచేసి 5 వేల ప్యాకెట్లు సొంతముగా తయారు చేయించి MLA అంజి బాబు అద్వర్యము లో విజయవాడ పంపడం జరిగింది దీనికి ఆర్.ఎస్.ఎస్.భీమవరం సభ్యులు వాసవీ క్లబ్ గునుపూడి సభ్యులు ప్యాకెట్లు చేయడానికి ఒక సైన్యంలా సహకరించి నందుకు వారికి ఛాంబర్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు. మరియు ఛాంబర్ లోబాగమైన మెడికల్ అసోసియేషన్ వారు రాష్టంలోనే ముందుగా స్పందించి బాధితులకు మెడికల్ కిట్స్ పంపడం అభినందనీయం అని ఛాంబర్ అభినందలు తెలిపింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ కమిటీ సభ్యులైన ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి శివ, కార్య దర్సులు కాగిత రమణ గారికి సంగడిబుజ్జికి తుమ్మలపెంట రంజిత్ కుమార్ గారికి గురు ప్రసాద్ కి మరియు సుంకర చినబాబు అధ్యక్షులు మానేపల్లి గుప్తా,మేనేజర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
