సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి ఐశెట్టి నాగేశ్వర రావు ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు నేటి శనివారం ఉదయం సమావేశం అయ్యి ఆయన మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి తీవ్ర సంతాపం ప్రకటించారు. స్వర్గీయ ఐసెట్టి నాగేశ్వరరావు భీమవరం ఛాంబర్ అఫ్ కామర్సమాజీ కార్యదర్శి గా, భీమవరం పట్టణ వస్త్ర వ్యాపారుల సంఘం అడ్జక్షులుగా ఎన్నో సమస్యల పరిష్కారంలో సేవలు అందించారని వారి సోదరులు, కుమారులు భీమవరం వ్యాపార రంగంలో రాణిస్తున్నారని ,ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సబ్యులకు సంఘీభావం తెలియజేస్తున్నామని ప్రకటించారు.
