సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ మంత్రివర్గ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వచ్చే నెల ‘విజయదశమి‘ నుంచి విశాఖ నుంచే ప్రభుత్వ పాలన ప్రారంభమౌతుంది అని ప్రకటించినట్లు తాజా సమాచారం. అప్పటివరకూ కార్యాలయాలను తరలించాలని నిర్ణయం,, విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు చేస్తాం. ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్రం సూచనలను పరిశీలిస్తామన్నారు. ఇంకా ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం జరిగింది. వాటిలో.. ప్రభుత్వ ఉద్యో గుల జీపీఎస్ బిల్లుఅమలుకు కేబినెట్ ఆమోదం.. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేలా చూడాలి , ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
