సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు, ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ అధికారుల, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఈయనతో పాటు సహా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వివిధ శాఖలు ఎంతో సృజనాత్మకంగా ఏర్పాటు చేసిన వాహన శకటాల పెరేడ్ ను సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు ఆసక్తిగా వీక్షించారు.రాష్ట్రంలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు కళాకారులకు, ఉపాధ్యాయులకు విశిష్ట పతకాలు గౌరవ పురస్కారాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *