సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ను దక్షిణ రైల్వే ప్రకటించింది. నెం.06507 బెంగళూరు – ఖరగ్పూర్, ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు తెలవారుజాము 2.45 గంటలకు ఖరగ్పూర్ చేరుకుంటుంది. మరోమార్గంలో నెం.06508 ఖరగ్పూర్ – బెంగళూరు ప్రత్యేక రైలు ఈనెల 15, 22, 29, మే 6, 13, 20 (సోమవారం రోజులలో) తేదీల్లో ఖరగ్పూర్లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, జోలార్పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపురం, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసూర్ స్టేషన్లలో ఆగుతాయి.
