సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ , ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టులో నేడు, గురువారం జరిగిన వాదనలు తదుపరి విదేశాలు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి జగన్ కి న్యాయస్థానం అనుమతించింది. లండన్ లో చదువుకొంటున్న కుమార్తెలను చూడటానికి కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ కోర్టును కోరారు. విచారణ అనంతరం ధర్మాసనం సీఎంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనకు విజయసాయిరెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి కోర్టుకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *