సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: విశాఖ లో నేడు, సోమవారం సాయంత్రం నుండి రాజధానుల వికేంద్రీకరణ సాధనకై వివిధ రంగాల మేధావులు, ఉద్యో గులు,వివిధ రంగాలు నిపుణులుతో పెద్దస్థాయిలో జరుగుతున్నా రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి.. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిన నేపథ్యంలో సీఎం జగన్ పరిపాలన రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తున్నాం.. మరి అమరావతి రైతుల పేరుతొ కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్భలంతో ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలని, ఇక్కడ గొడవలు సృష్టించడానికి అరసవల్లి పాదయాత్ర చేస్తారా?అని ప్రశ్నించారు. అసలు వీరికి ఇంత డబ్బు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు? దీనివెనుక కుట్ర ఉంది.. విశాఖను పరిపాలన రాజధానిగా కాపాడుకొనేందుకు ఎటువం టి త్యాగలుకైనా సిద్ధం . ఆంధ్ర ప్రదేశ్ కు విశాఖ అపూర్వ రాజధానిగా తలమానికం అవుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలంతా ఈ నెల 15న విశాఖ గర్జన కు సిద్ధం కండి .. మన ప్రాంత అభివృద్ధి కి వచ్చిన సువర్ణ అవకాశం జారవిడుచుకోకుడనని పిలుపునిచ్చారు.
