సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిగ్రీ చదివిన నిరుద్యోగులకు శుభవార్త…. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) నుంచి మరో భారీ జాబ్‌ ఆఫర్స్ నోటిఫికేషన్‌ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రూప్‌ బి, గ్రూప్‌ సీ పోస్టుల కోసం కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్షలు నిర్వహించనుంది. డిగ్రీ అర్హతపై ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్‌ 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు మే 3వరకు దరరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. ఆ పోస్టుల వివరాలివే..ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో సహా పలు శాఖల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీబీడీటీలో ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, సీబీఐలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, ఎన్‌హెచ్ఆర్‌సీలో రీసెర్చి అసిస్టెంట్‌, ఎన్‌ఐఏలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌/ జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌, కాగ్‌లో ఆడిటర్‌, అకౌంటెంట్‌, తపాలాశాఖలో పోస్టల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, సీబీడీటీలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, నార్కొటిక్స్‌ బ్యూరో, ఆర్థికమంత్రిత్వశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను బట్టి జీతాలు : నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100 ఉంటుంది, ఇక ఆయా ఉద్యోగాలకు కనీస వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు వయో సడలింపు కల్పించారు. వీరితో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా వయో సడలింపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాల వివరాలు:చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *