సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక రెస్ట్ హౌస్ రోడ్డులోని రామాలయం వద్ద శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నేడు, ఆదివారం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 66వ జాతర మహోత్సవాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. వాడవాడలా శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతరలను సంప్రదాయ బద్దంగా నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం అమ్మవారి జాతరను కమిటీ సభ్యులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ యాదవ సంఘం జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు
