సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అత్యంత ఘనంగా 61వ వార్షికోత్సవాలు జరుపుకొంటున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, మంగళవారం దర్శించుకొన్న హైదరాబాద్ కి చెందిన భక్తులు చింతలపాటి సుభాస్ చంద్ర బోసు రాజు 50,000 రూపాయలు కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కొప్పెశ్వవరరావు పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
