సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం పౌర్ణమి సందర్భంగా లోక కల్యాణార్థం సర్వము శుభకరంగా ఉండాలని మహాశక్తి శ్రీ అమ్మవారిని కోరుకొంటూ.. అనేక మంది మహిళా భక్తులు శ్రీ లలితా సహస్త్ర పారాయణం మరియు భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో చండీహోమం ను వేదమంత్రోచ్చారణలతో ఆలయ ప్రధానఅర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జునశర్మ మరియు వేదపండితులు నిర్వహించారు.మొత్తం 62మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, తెలిపారు.
