సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకుంది శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నేడు, బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు అధికారులు ఏడో నంబర్ యూనిట్‍లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు.పవర్ హౌస్‌లో వచ్చిన భారీ శబ్దాలకు పలువురు ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు.అసలే జలశయానికి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు.అనంతరం సమస్యను గుర్తించిన అధికారులు సాంకేతిక లోపం తలెత్తి శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. కండెన్సర్ కాలిపోయి పేలుడు సంభవించినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన విద్యుత్ ఉత్పత్రి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *